తమిళనాడులోని తిరుచ్చి అరియమంగళం పోలీస్స్టేషన్ పరిధి రైల్నగర్ గాంధీజీ క్రాస్ స్ట్రీట్ వద్ద సోమవారం ఆటోడ్రైవర్ మారి ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది నలుగురి మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.