తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు..రైతుల ప్రీమియాన్ని భరించాలని నిర్ణయించింది. రాష్ట్ర సబ్సిడీతోపాటు రైతుల తరఫున ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం రేవంత్రెడ్డి గతంలోనే తెలిపారు. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయశాఖ అధికారులు విధివిధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యారు.