ఏపీలో వరుస దాడులు.. చంద్రబాబు కీలక పిలుపు

63చూసినవారు
ఏపీలో వరుస దాడులు.. చంద్రబాబు కీలక పిలుపు
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయాన్ని సాధించింది. ఈ నెల 12న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఫలితాల తర్వాత ఏపీలో టీడీపీ, వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు కీలక పిలుపునిచ్చారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ టీడీపీ నేతలు సంయమనం పాటించాలన్నారు. దాడులు, ప్రతిదాడులకు పాల్పడవద్దని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్