మనుబోతు పిల్లను చేరదీసిన అధికారులు

67చూసినవారు
మనుబోతు పిల్లను చేరదీసిన అధికారులు
తల్లి నుంచి విడిపోయి పంట చేలోకి చేరిన మనుబోతు పిల్లను ఫారెస్ట్ అధికారులు అక్కున చేర్చుకున్నారు. దాని ఆలనాపాలనా చూస్తున్నారు. గత నెల 2న అమ్రాబాద్ మండలం మన్ననూర్ సరిహద్దు అటవీ సమీపంలోని ఓ పంట పొలంలో మూడు నెలల మనుబోతు పిల్ల ఉండడాన్ని రైతు గుర్తించాడు. దాని తల్లి కనిపించలేదు. ఫారెస్ట్ సిబ్బంది ఆ మనుబోతు పిల్లను మంగళవారం పట్టుకుని డీఎఫ్వో రోహిత్ గోపిడి క్వార్టర్ ఆవరణలో వదిలి దాని బాగోగులు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్