నిమిషం ఆలస్యం... 15 మందికి చుక్కెదురు

62చూసినవారు
మహబూబ్ నగర్ రూరల్ మండలం జయ ప్రకాష్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు చుక్కెదురైంది. ఆదివారం నిర్ణీత సమయానికి రాకుండా దాదాపు 15 మంది అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడంతో అధికారులు వారిని పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. వారు చాలా సేపు అధికారులను వేడుకున్నా కూడా అధికారులు కనికరించలేదు. చేసేదేమి లేక వారు నిరాశగా వెనుదిరిగారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్