కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న(ఆదివారం) కేసీఆర్ తో గంగుల, 29 మంది కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ పార్టీని వీడితే నష్టమని భావించి కేసీఆరే.. ఆయన్ను ఫామ్హౌస్కు ఆహ్వానించినట్లు సమాచారం. భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దేనని, ఎవరూ పార్టీ మారొద్దని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది.