పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందుగా పని చేస్తుంది. ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగడం వల్ల అరుగుదల సమస్య దూరం అవుతుంది. దాంతోపాటు పొట్టలో పురుగులు, శరీరంలోని విషపదార్ధాలు నశిస్తాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇక గుమ్మడి గింజలను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఈ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.