విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌.. 39 మందికి అస్వస్థత

51చూసినవారు
విమానాశ్రయంలో గ్యాస్‌ లీక్‌.. 39 మందికి అస్వస్థత
మలేషియాలోని కౌలాలంపూర్‌ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో గ్యాస్‌ లీక్‌ కావడంతో సుమారు 39 మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లోని సదరన్‌ సపోర్ట్‌ జోన్‌ సెపాంగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజినీరింగ్‌ ఫెసిలిటీ వద్ద గ్యాస్‌ లీకైంది. సమాచారం అందుకున్న సెలంగోర్‌ అగ్నిమాపక విభాగం వెంటనే అప్రమత్తమై గ్యాస్‌ లీకేజీని ఆపేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్