దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో భాగంగా వెనుకబడిన తరగతుల వారికి వరాల జట్లు కురిపించారు. గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు., వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు, స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్, చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు.