రసాయనాలు, నాసిరకం సాస్ వాడుతున్న కారణంగా కర్ణాటక, గోవా ప్రభుత్వాలు గోబీ మంచూరియాపై నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో తమిళనాడులో విక్రయించే గోబీ మంచూరియా, చికెన్ 65 ఫుడ్స్ లో రసాయనాలు ఉన్నాయో లేదో పరీక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తమిళనాడులో రోడమైన్-B రసాయనం వాడుతుండడంతో పీచు మిఠాయిపై ఇటీవల నిషేధం విధించింది.