గోదావరి ఉద్ధృతి.. పాపికొండల విహారయాత్ర నిలిపివేత‌!

61చూసినవారు
గోదావరి ఉద్ధృతి.. పాపికొండల విహారయాత్ర నిలిపివేత‌!
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం ఆవరణలోకి గోదావ‌రి వరదనీరు చేరింది. భక్తుల క్యూలైన్లతో పాటు ఆలయం సమీపంలోని దుకాణాలను వరద ముంచెత్తింది. దీంతో దర్శనాలను ఆపేశారు.

సంబంధిత పోస్ట్