సుమిత్‌, మరియప్పలకు స్వర్ణాలు

66చూసినవారు
సుమిత్‌, మరియప్పలకు స్వర్ణాలు
ప్రపంచ పారా అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మంగళవారం జరిగిన పురుషుల ఎఫ్‌-64జావెలిన్‌ త్రోలో సుమిత్‌ అంటిల్‌, హైజంప్‌ టి-63లో మరియప్పన్‌ తంగవేలు రికార్డు బ్రేక్‌ నమోదు చేస్తూ బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. పారా జావెలిన్‌ త్రోలో సుమిత్‌ అంటిల్‌ 69.50మీ. జావెలిన్‌ను విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక హైజంప్‌ టి-63లో మరియప్పన్‌ తంగవేలు 1.88మీ. జంప్‌ చేశాడు.

సంబంధిత పోస్ట్