దక్షిణ భారతదేశంలోని మద్యం ప్రియులకు ఢిల్లీకి చెందిన కిమయా హిమాలయన్ బెవరేజెస్ సంస్థ శుభవార్త చెప్పింది. బార్లీ ఆధారిత స్వదేశీ బీర్ను ఏప్రిల్ 2024 నాటికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలో ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ సీఈవో అభినవ్ జిందాల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తిని ఉత్తర భారత్లోని ఢిల్లీ, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు.