సాధారణ ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే రెండేళ్లలో నాన్- ఏసీ కోచ్లను 22 శాతం పెంచనుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 2,605 జనరల్ కోచ్లు, 1,470 నాన్-ఏసీ స్లీపర్ కోచ్లతో పాటు 323 సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్ (ఎస్ఎల్ఆర్) కోచ్లను అందుబాటులోకి తీసుకురానుంది. కోచ్లతో పాటు అధిక సామర్థ్యం గల 32 పార్శిల్ వ్యాన్లు, 55 ప్యాంట్రీ కార్లను కూడా తయారు చేయనున్నారు.