టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆయన ఎన్సీఏలో ప్రాక్టీస్ ప్రారంభించారు. సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్ లేదా ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగే సిరీస్లో షమీ ఆడనున్నట్లు సమాచారం. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ అనంతరం షమీ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్కు దూరమైన సంగతి తెలిసిందే.