రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం: ఏలేటి

71చూసినవారు
రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం: ఏలేటి
రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. '35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యంపై అదనంగా రూ.800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారు. మిల్లర్లకు ఇచ్చిన 90 రోజుల గడువు దాటినందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. 1.59 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్మింది. మళ్లీ అధిక ధరకు బిడ్డర్ల నుంచి సన్నబియ్యం కొనడం ఎందుకు' అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్