AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ రాత్రికి తీవ్ర తుఫానుగా బలపడనున్నట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు రాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీవ్ర తుపానుగా తీరం దాటుంతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.