భారత్లో ఐటీ హార్డ్వేర్, టీవీ, వాషింగ్మెషీన్, ఏసీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తుంది. ఎర్ర సముద్రంలో సరుకు రవాణాచేసే షిప్లపై హౌతీల దాడులే దీనికి కారణమని సమాచారం. దీంతో షిప్పింగ్ కంటైనర్ల కొరత, ముడిసరుకు రవాణా ఛార్జీల పెంపు కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుదారుపై రానున్న రోజుల్లో భారం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.