బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చివాత పెట్టినా కేటీఆర్కు బుద్ధి రాలేదని, రైతు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అవడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు ఆయన దురంహకారానికి నిదర్శనమన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు తాట తీస్తారన్నారు.