టీ20 ప్రపంచకప్ విజేత మహ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ప్రస్తుతం ఆయన మెహిదీపట్నంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ సరోజినీ దేవి ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు కొనసాగనుంది.