రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో ఐదు వికెట్లను కోల్పోయి భారత్ గెలిచింది. శుభ్మన్ గిల్ (52*), ధ్రువ్ జురెల్ (39*) చివరి వరకూ క్రీజ్లో ఉండి టీం ఇండియాను విజయతీరాలకు చేర్చారు. దీంతో మరో టెస్ట్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది.