ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లకు పార్టీలోని ముఖ్య నాయకులు ఇంటర్వ్యూలు ఇస్తూ.. తమ పార్టీ ప్రధాన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు జైశంకర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ ప్రముఖ పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా మరో పాడ్కాస్ట్ ఛానల్ ముఖాముఖిలో పాల్గొన్నారు.