కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూన్ 22న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఢిల్లీ వేదికగా జరిగే 53వ కౌన్సిల్ సమావేశం ఇది. వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. అక్టోబర్ 7న చివరి సమావేశం జరిగింది. అయితే ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఇంకా తెలియరాలేదు.