ముష్కరుల దాడి.. 15 మంది పోలీసులు మృతి

56చూసినవారు
ముష్కరుల దాడి.. 15 మంది పోలీసులు మృతి
రష్యాలోని డాగేస్తాన్ పరిధి నార్త్ కాకసస్ ప్రాంతంలో ఆదివారం దారుణం జరిగింది. ఓ ప్రార్థనా మందిరం, 2 ఆర్థోడాక్స్ చర్చిలు, పోలీస్ పోస్ట్‌పై ముష్కరులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ముష్కరుల దాడుల్లో 15 మందికి పైగా పోలీసులు, ఒక మతగురువు చనిపోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సామాన్య పౌరులు సైతం చనిపోయారని తెలుస్తోంది. ఇక దాడికి పాల్పడ్డ ఐదుగురు ముష్కరులను పోలీసులు కాల్చి చంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్