సచివాలయంలో ఉన్నతాధికారి వేధింపులు

78చూసినవారు
సచివాలయంలో ఉన్నతాధికారి వేధింపులు
తెలంగాణ సచివాలయంలో వేధింపు ఘటనలు ఇటీవల తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు ఐఏఎస్‌లు ఆఫీస్ అటెంర్లను తమ ఇంట పనికి వినియోగించుకుంటున్న బాగోతం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఓ ఉన్నతాధికారి వేధింపుల బాగోతం వెలుగు చూసింది. అడిషనల్ సెక్రెటరి హోదాలో ఉన్న అధికారి మహిళ ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తనకు దిగుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని సమాచారం.

సంబంధిత పోస్ట్