ఎన్డీయే ప్రభుత్వంపై ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీష్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రివర్గం కొలువుతీరిందని, కానీ ఈ ప్రభుత్వం పరస్పర వైరుధ్యాలున్న వారితో నిండిపోయిందని అన్నారు. పార్టీలు మార్చడంలో నిష్ణాతులైన నేతలు ప్రభుత్వంలో ఉన్నారని నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వంటి నేతలను పరోక్షంగా ప్రస్తావిస్తూ హరీష్ రావత్ వ్యాఖ్యానించారు.