మరోసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్ నాథ్ సింగ్ అగ్నిపథ్ పథకం సమీక్షకే తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సైనిక బలగాల నుంచి అభిప్రాయ సేకరణ మొదలైంది. సూచనల మేరకు పథకంలో మార్పులు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదుల ముప్పు, ఎల్ఏసీ, ఎల్ఓసీలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై కూడా రాజ్నాథ్ దృష్టి సారిస్తారు.