పెళ్లైన నెలకే భార్యను చంపేశాడు

1046చూసినవారు
పెళ్లైన నెలకే భార్యను చంపేశాడు
రాజస్థాన్‌ ఝలావర్ జిల్లా గోగాడి గ్రామంలో దారుణం జరిగింది. సునీతకు రాజారామ్ తన్వర్‌తో గతంలో ఎంగేజ్‌మెంట్ జరిగింది. తర్వాత అది రద్దు అయింది. అయితే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. దీంతో ఫిబ్రవరి 10న లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. తర్వాత రాజారామ్ తాగుడుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం దంపతులు గొడవ పడ్డారు. మద్యం మత్తులో భార్యను రాజారామ్ తలపై కొట్టి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్