యూపీలోని లఖీంపూర్లో ఓ స్టూడెంట్ దారుణహత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. అమోగ్ సేథ్ అనే అతను బీబీఏ చదువుతున్నాడు. అయితే అన్మోల్, అమోగ్ మధ్య ఆదివారం గొడవ జరిగింది. ఈ క్రమంలో తనను అవమానించాడని కక్ష పెంచుకున్న అన్మోల్ స్నేహితులతో కలిసి అమోగ్ సేథ్పై దాడికి దిగాడు. అతడు పారిపోయే క్రమంలో ఓ షాపులోకి దూరగా గన్తో కాల్చి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.