రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం

68చూసినవారు
రామ్‌దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీంకోర్టు ఆగ్రహం
పతంజలి వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబా, ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసుపై విచారణలో భాగంగా వీరు మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై మరోసారి సర్వోన్నత న్యాయస్థానంలో క్షమాపణలు చెప్పారు. కాగా ప్రజారోగ్యం విషయంలో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించారని.. అల్లోపతిని తగ్గించి చూపకూడదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

సంబంధిత పోస్ట్