రెమాల్ తుఫాను వచ్చినప్పటి నుండి గత కొన్ని రోజులుగా మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని నోంగ్ప్రియాంగ్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 70 ఏళ్ల వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సమాచారం.