తిరుమలలో అధిక ధరలకు దర్శన టికెట్లు విక్రయిస్తున్న ఓ దళారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను.. దళారి అధిక ధరలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టింది. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న బాలాజీ నగర్కు చెందిన రాజశేఖర్ను పోలీసులు అరెస్ట్ చేశారు.