తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వైకుంఠ క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ల అన్నింట్లో భక్తులు వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. గురువారం స్వామివారిని 64,115 మంది భక్తులు దర్శించుకోగా, 32,711 మంది తలనీలాలు సమర్పించారు. రూ.4.23 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది.