తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో కన్యాకుమారి, తిరునల్వేలి, తెంకాసి జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. తూతుకూడు తదితర ప్రదేశాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఇవాళ్టి నుంచి మార్చి 13 వరకు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.