రాజస్థాన్లో ఎండలు మండిపోతున్నాయి.ఈ క్రమంలో ఉష్ణోగ్రతల తీవ్రతను ఓ సైనికుడు అప్పడం (పాపడ్)తో కళ్లకు కట్టేలా చూపారు. బికనీర్ లో డ్యూటీ చేస్తూ అప్పడంపై ఇసుక వేయగా.. అది కాసేపటికే నూనెలో వేంచిన అప్పడంలా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇంతటి ఎండలో దేశ రక్షణకోసం పనిచేస్తున్న జవాన్లకు సెల్యూట్ అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు. ఉత్తర భారతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.