భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. చిరాకుతో వాహనాలను రోడ్డుపైనే వదిలి వెళ్లిన బెంగళూరు వాసులు(వీడియో)

60చూసినవారు
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంతా కాదు. బుధవారం రాత్రి బెంగళూరు వాహనదారులు మరోసారి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా నీరు రోడ్లపైకి చేరింది. ఈ క్రమంలో అక్కడి ఎలక్ట్రానిక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. దాదాపు 3 గంటలకు పైగా ట్రాఫిక్‌లోనే ఉన్నారు. దీంతో విసుగుచెందిన కొందరు వాహనాలను వదిలేసి నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్