ఇవాళ ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సోరెన్ మరోసారి సీఎంగా ఎన్నికవడం ఖాయమని మంత్రి సత్యానంద్ భోక్తా తెలిపారు. శాసనసభా పక్ష సమావేశంలో హేమంత్ సోరెన్ను ఎమ్మెల్యేలంతా నాయకుడిగా ఎన్నుకుంటారని చెప్పారు. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ రాజీనామా చేస్తారన్నారు. ఆ తర్వాత నూతన సీఎంగా హేమంత్ ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.