కేంద్రం తాజాగా చారిత్రక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు ఏంజిల్ ట్యాక్స్ను రద్దు చేసింది. అలాగే విదేశీ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ను 40 శాతం నుంచి 35 శాతానికి కుదించింది. దీంతో స్టార్టప్లు, అన్ లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడిని సమీకరించే అవకాశాలు మెరుగున పడనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు లబ్ధి చేకూరుతుంది.