ఆసుపత్రిలో చేరిన భారత క్రికెటర్

83చూసినవారు
ఆసుపత్రిలో చేరిన భారత క్రికెటర్
భారత యువ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్‌ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఇరానీ కప్‌ టోర్నీలో ఆడుతున్న శార్దూల్‌ అనారోగ్యానికి గురయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతూనే బ్యాటింగ్‌ చేసిన అతడిని మ్యాచ్ అనంతరం లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శార్దూల్‌ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. మలేరియా, డెంగీ వంటి పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్