ఉగాది పండుగ నేపథ్యంలో రాష్ట్రాల్లో ఈ వారం పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగతా చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. చిన్న గులాబీలు రూ.250-రూ.300, మల్లెలు కేజీ రూ.700-రూ.800, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఎండల కారణంగా పూల దిగుబడి తగ్గడం, ఉగాదికి డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి.