యూపీలోని లక్నో జిల్లా మలిహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణం జరిగింది. సరవా గ్రామానికి చెందిన వివాహిత (25)ను ఆమె భర్త దారుణంగా చంపేశాడు. కట్నంగా కారు ఇవ్వలేదనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఆమె తలపై తుపాకీతో కనికరం లేకుండా కాల్చి చంపాడు. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. రక్తపు మడుగులో ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.