తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న మధ్య ప్రదేశ్ థార్ ప్రాంతానికి చెందిన దొంగల ముఠాను రాజేంద్రనగర్, మాదాపూర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సమయంలో వారి వద్ద మారణాయుధాలు లభ్యమైనట్లు తెలిపారు. దొంగతనాల సమయంలో అడొచ్చిన వారి ప్రాణాలు తీయడానికి వెనకాడరని, ఇప్పటికే వారిపై 36 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.