రేపు జూపార్కుకు సెలవు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న నగరంలోని నెహ్రూ జూ పార్కుకు సెలవు ఉంటుందని జూ క్యూరేటర్ డా, సునీల్, ఎస్. హిరేమత్ ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి మంగళవారం యథావిథిగా తెరిచి ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులు జంతు ప్రదర్శనశాలను విక్షించవచ్చన్నారు. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు.