హైదరాబాద్ హుస్సేనీ ఆలం పీఎస్ పరిధిలోని పికెటింగ్ పాయింట్ వద్ద ఎస్ఐ బాలేశ్వర్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం షిఫ్ట్ మారే సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు.