స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని మంగళవారం హైదరాబాద్ బీఆర్కేఆర్ భవన్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలువడానికి అబద్ధాలు ప్రచారం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకురాలు మాధవి, తదితరులు పాల్గొన్నారు.