పంజాగుట్ట మహేశ్వరి చాంబర్స్ లో అగ్నిప్రమాదం

571చూసినవారు
పంజాగుట్ట ప్రధాన రహదారికి పక్కనే ఉన్న మహేశ్వరి చాంబర్స్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ తో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణాష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్