సికింద్రాబాద్ బీజేపీ ఇంచార్జీ, మాజీ గవర్నర్ తమిళి సై ఖైరతాబాద్ లోని శ్రీ రామాంజనేయ స్వామి ఆలయాన్ని మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, సికింద్రాబాద్ ఎంపీ స్థానం తప్పకుండా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీకి మద్దతుగా ఉన్నారని, మరోసారి మోడీని ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.