ఖైరతాబాద్ గణేష్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

60చూసినవారు
ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం స్వామివారి మండపం వద్ద ఏర్పాట్లను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దగ్గరుండి పరిశీలించారు. అనంతరం క్యూలైన్లో వస్తున్న భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్