కలుషిత ఆహారం తిని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం స్పందించడం లేదని బాలానగర్ ఐడిపిఎల్ చౌరస్తాలో ఎబివిపి విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు దాదాపు 300 మంది విద్యార్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.