బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో
కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి 17 రోజుల పాటు జరిగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేసింది.